ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటిపై దాడులకు తెగబడతారా:అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 08:43 PM

అభివృద్ధిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంటి మీదపడి దాడులు చేసే కుసంస్కారానికి వైసీపీ దిగజారిందని టీడీపీ నేత కె.అచ్చెన్నాయుడు విమర్శించారు. హిందూపురం అభివృద్ధిపై స్థానికులు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపైకి వైసీపీ రౌడీలు దాడికి  ప్రయత్నించాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ముఠా చర్యలను ఖండిస్తున్నాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికొదిలేశారు. భౌతిక దాడులు రాష్ట్రంలో పెరిగాయని డీజీపీ విడుదల చేసిన క్రైమ్ రిపోర్ట్ చూసైనా పాలకులు సిగ్గుతెచ్చుకోవాలి. చేతనైతే రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో సమాధానం చెప్పండి.? పాలన చేతకాని ముఖ్యమంత్రిని నిలదీయలేక ప్రశ్నించిన వారిపై ప్రతాపం చూపుతున్నారు. రాష్ట్రాన్ని లూఠీ చేసిన జగన్ రెడ్డి ఇంటిపై, ప్రజలు భరించలేని విధంగా పన్నులు వేస్తున్నందుకు వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయాలి.  జగన్ రెడ్డి గూండా యిజానికి బెదిరేవారెవరూ లేరు. దాడి చేయడానికి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధి నివాసంపైనే దాడికి పాల్పడితే ఇక సామన్యుల పరిస్థితి ఏంటి.? భయపెట్టి పాలన సాగిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా.? రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది ఎక్కడా మచ్చుతునకైనా లేదు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని మర్చిపోయి రెండున్నరేళ్లు అయింది. ప్రజల సమస్యలు పక్కదారి పట్టించేందుకు ఏదోఒక యాగీకి చేస్తున్నారు. శాంతిభద్రతలు గాలికొదిలారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రజలు పాతాళంలోకి తొక్కుతారు. వైసీపీ కార్యకర్తలను జగన్ రెడ్డి అదుపులో పెట్టుకోవాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతాం. అని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa