కరోనాకు చెక్ పెట్టేందుకు ఇక టీకాల పై ఆధార పడవలసిన వసరం కనిపించటం లేదు. కరోనా ను సునాయాసంగా చెక్ పెట్టేందుకు త్వరలో టాబ్లెట్ అందుబాటులోకి రాబోతోంది. కరోనా మహమ్మారి కట్టడికి భారత్ లో మరో మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. మోల్నుపిరావిర్ ట్యాబ్లెట్స్ను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మార్కెట్లోకి ఆప్టిమస్ సంస్థ విడుదల చేసింది. దీనికి అమెరికా, యూకేతో పాటు ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా అనుమతి ఇచ్చింది. ఒకవైపు కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి కలవరపెడున్న ఈటైమ్ లో కరోనాకి విరుగుడుగా మోల్నుపిరావిర్ టాబ్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇది కొంత ఊరట కలిగించే విషయమే. ఇండియాలో ఈ మోల్నుపిరావిర్ ట్యాబెట్స్ తయారు చేసుందుకు దాదాపు 13 కంపెనీలు అనుమతి తీసుకున్నాయి. అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్కి చెందివే ఉన్నాయి. ఆ 13 కంపెనీల్లో ఒక్కటైన ఆఫ్టిమస్ సంస్థ మోలోకోవిర్ పేరు ట్యాబ్లెట్స్ తయారు చేసింది. వీటిని హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్స్ను జనవరి 3 నుంచి మిగతా నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మోల్నుపిరావిర్ను మార్కెట్లోకి తెచ్చేందుకు మిగిలిన ఫార్మా కంపెనీలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa