సోషల్ మీడియాలో సమాచారం ఎంతవేగంగా అందుతుంతే అంతే వేగంగా అసత్యాలు కూడా ప్రచారమందుకొంటుంటాయి. తాజాగా ఓ పోస్ట్ కూడా అలాంటిదే వైరల్ అవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుందా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బ్యాడ్ న్యూస్ అందించిందా? ఒమిక్రాన్ నేపథ్యంలో డియర్నెస్ అలవెన్స్ డీఏ చెల్లింపులను వాయిదా వేసిందా? దీనికి సంబంధించి కేంద్రం ఆర్డర్లు జారీ చేసిందా? సోషల్ మీడియాలో ఇలాంటి ఆర్డర్తో కూడిన ఒక పోస్ట్ తెగ వైరల్ అయిపోయింది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఇలాంటి ఆర్డర్లు ఏవీ వెలువడలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇది ఫేక్ పోస్ట్ అని వెల్లడించింది. దీన్ని ఎవ్వరూ నమ్మవద్దని కోరింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఒక ట్వీట్ కూడా చేసింది. ఆర్థిక శాఖ పేరిట ఫేక్ ఆర్డర్ను జారీ చేశారని వివరించింది. ఇందులో డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ చెల్లింపులు వాయిదా వేశారని ఉంది. ఇది పూర్తిగా అసత్యం. దీన్ని ఎవ్వరూ నమ్మవద్దు.డియర్నెస్ అలవెన్స్ ప్రస్తుతం 31 శాతంగా ఉంది. 2021 అక్టోబర్ నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ను పెంచింది. పెంపు అనేది 2021 జూలై 1 నుంచే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 28 శాతం నుంచి 31 శాతానికి పెంచామని 2021 జూలై 1 నుంచే ఇది అమలులోకి వచ్చిందని ఆర్థిక శాఖ అధికారిక ఆర్డర్లు పేర్కొంటున్నాయి. దీని కన్నా ముందు అంటే 2021 జూలైకి ముందు డియర్నెస్ అలవెన్స్ 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa