నిన్న విశాఖలో రింగ్ వలల బొట్లు తగులపెట్టిన కేసులో నూకరాజు ను అన్యాయంగా అరెస్ట్ చేసారంటూ విశాఖ పెదజాలరి పేటలో జాలరులు ఆందోళన చేస్తున్నారు. నూకరాజును విడిచి పెట్టకపోతే మంత్రులు సమావేశానికి హాజరు కావొద్దని జాలరులు నిర్ణయం తీసుకున్నారు. రోడ్డ్డు పై బైటాయించి ఆందోళనకు దిగారు.దీనితో విశాఖ పెదజాలరి పేటలో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే ... మంగళవారం పెద్దజాలరిపేట, గంగమ్మతల్లి గుడి మత్స్యకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. తిమ్మాపురం వద్ద నడి సముద్రంలో రింగ్ వలల వివాదంతో ప్రత్యర్థులు బోటుకు నిప్పు పెట్టారు. దీంతో ఇరువర్గాల మత్స్యకారులు పడవలపై గొడవకు దిగారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. తీరం వద్దకు రెండు గ్రామాల ప్రజలు చేరుకున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా నూకరాజు ను అన్యాయంగా అరెస్ట్ చేసారంటూ విశాఖ పెదజాలరి పేటలో జాలరులు ఆందోళన చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa