ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 08:52 AM

మహారాష్ట్రలో కొవిడ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవు తున్నాయి. తాజాగా ఒక్కరోజు వ్యవధిలో 41 వేల 434 కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనాతో చనిపోయారు. మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1009కి చేరింది. ఇక ముంబై మహానగరంలో 20 వేల 318 కరోనా కేసులు వెలుగుచూశాయి. బాంద్రా సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. 68 మంది సీబీఐ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కఠిన ఆంక్షలు విధించింది. ఈ నెల 10 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. పాఠశాలలు కూడా ఫిబ్రవరి 15 వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరిలో 50 శాతం ఆక్యూపెన్సీ రేటుతో మాల్స్, థియేటర్స్ నడవనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa