ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో భారత్‌కి షాకిచ్చిన కంగారూలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2017, 09:06 AM

భారత్ గడ్డపై కంగారూల గెలుపు నిరీక్షణకి తెరపడింది. గత మూడు వన్డేల్లోనూ ఘోర పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా జట్టు బెంగళూరు వేదికగా గురువారం జరిగిన నాలుగో వన్డేలో 21 పరుగుల తేడాతో గెలుపొంది తాజా సిరీస్‌లో ఎట్టకేలకి గెలుపు రుచి చూడగలిగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (124: 119 బంతుల్లో 12x4, 4x6), అరోన్ ఫించ్ (94: 96 బంతుల్లో 10x4, 3x6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోరు చేసింది.


అనంతరం లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (65: 55 బంతుల్లో 1x4, 5x6), అజింక్య రహానె (53: 66 బంతుల్లో 6x4, 1x6), కేదార్ జాదవ్ (67: 69 బంతుల్లో 7x4, 1x6) మెరుగ్గా ఆడటంతో ఒకానొక దశలో గెలిచేలా కనిపించిన భారత్ జట్టు.. చివర్లో తడబడి 313/8కే పరిమితమైంది. విరాట్ కోహ్లి (21), హార్దిక్ పాండ్య (33), మనీశ్ పాండే (33) కీలక సమయంలో ఔటవడం.. చివర్లో మహేంద్రసింగ్ ధోనీ (13: 10 బంతుల్లో 1x4, 1x6) విఫలమవడంతో భారత్‌కి ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్ సన్ 3 వికెట్లు, కౌల్టర్‌నైల్ రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa