ఓటమిలోనూ చిత్తుచిత్తుగా ఉండటం, గౌరవ ప్రధమమైన ఓటమి అనేది ఉంటుంది. తాజాగా ఇండియాతో తలపడిన శ్రీలంగా ఓడినా గౌరవ ప్రధామమైన ఓటమిని సొంతం చేసుకొంది. కెప్టెన్ దసున్ షనక భారత బౌలింగ్ పై విరుచుకుపడిన వేళ శ్రీలంక జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ధర్మశాలలో టీమిండియాతో మూడో టీ20 మ్యాచ్ లో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఓ దశలో శ్రీలంక జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే దినేశ్ చాందిమల్ 25 పరుగులు చేయగా, కెప్టెన్ షనక శివాలెత్తిపోయాడు. 38 బంతుల్లోనే 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షనక స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. లంక ఇన్నింగ్స్ లో ఓపెనర్లు నిస్సాంక (1), గుణతిలక (0), చరిత్ అసలంక (4,) జనిత్ లియనాగే (9) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్ 1, హర్షల్ పటేల్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa