ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఎస్ఎఫ్ జ‌వాను కాల్పుల‌ు...ఐదుగురు సహచరుల మరణం

national |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 03:26 PM

అవహేళన ఓ జవాన్ ను అవమానంగా భావించేలా చేసింది. దీంతో అతడు కాల్పులు జరపగా తొటి జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని అమృత్ స‌ర్‌లోని బీఎస్ఎఫ్ సిబ్బంది శిబిరంలో ఈ క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓ బీఎస్ఎఫ్ జ‌వాను కాల్పుల‌కు పాల్ప‌డి ఐదుగురు జ‌వాన్ల ప్రాణాలు తీశాడు. త‌న‌ను తోటి జ‌వాన్లు అవ‌హేళ‌న‌కు గురి చేయ‌డంతోనే ఆ జ‌వాను ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.  ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో జ‌వానుకు కూడా గాయాలు కావ‌డంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉన్న‌ట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa