ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్ లో ముగిసిన పోలింగ్...ఇక ఫలితంపై ఉత్కంఠ

national |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 03:48 PM

మణిపూర్ రాష్ట్రంలో ఎన్నికలు ముగియగా ఇక విజేతలు ఎవరు అన్న ఆసక్తి ఆ రాష్ట్రంలో నెలకొంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా శనివారంనాడు మణిపూర్ లో చివరిదైన రెండో విడత పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి 76.62 శాతం పోలింగ్ జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇవాళ రెండో విడతలో 6 జిల్లాల్లో 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.  కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్టు ఈసీ పేర్కొంది. నాగమజు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బలగాల కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాంతో అక్కడ పోలింగ్ నిలిపివేశారు. కాగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa