ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్నవారిలో నేనూ ఒకరిని: యాంకర్ సుమ

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 03:00 PM

తన నివాసంలో జీఎస్టీ తనిఖీలు జరిగినట్టు వచ్చిన వార్తలపై బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల స్పందించారు. జీఎస్టీ సోదాలు జరిగినట్లు వెలువడిన వార్తలన్నీ అవాస్తవమన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా, సుమ, అనసూయ, రేష్మీ గౌతం తదితర యాంకర్ల నివాసాల్లో కూడా తనిఖీలు జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై సుమ స్పందించారు. తమ నివాసంలో ఎలాంటి తనిఖీలు జరగలేదని సుమ కనకాల వివరించారు. 'వినోద రంగంలో అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్నవారిలో నేనూ ఒకరిని' అని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ చెల్లించకపోవడంతోనే సోదాలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయని, అవన్నీ వాస్తవ దూరమని కొట్టిపారేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa