ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 09:23 PM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో విద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో అయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, పాఠశాల హెచ్ఎం, ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులతో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో అబ్దుల్ ఘని, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa