ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇంటి' భోజనానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 07:29 PM

ఇప్పుడంటే.. గల్లీ గల్లీకో రెస్టారెంటు.. ఎక్కడ చూసినా హోటళ్లు, టిపిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు కనిపిస్తున్నాయి కానీ.. అప్పట్లో.. పరిస్థితి వేరు. పుట్టగొడుగుల్లా హోటళ్లు రావటంతో పాటు.. జనాలు కూడా పని ఒత్తిడితోనో, ఉద్యోగాల్లో బిజీ అయిపోయో బయట తిండికి అలవాటు పడిపోయారు. ఇక.. ఈ మధ్య ఫుడె డెలివరీ యాప్స్‌ వచ్చినప్పటి నుంచి జనాలు కాలు కూడా కదపకుండా.. కూర్చున్న చోటికే భోజనం తెప్పించుకుంటున్నారు. అది కూడా ఇలాంటి అలాంటి భోజనం కాదు.. బిర్యానీలు, బర్గర్లు, ఫిజ్జాలు అంటూ ఎన్నో ఐటెంమ్స్‌కి అలవాటు పడిపోయారు. ఇలాంటి కాలంలోనూ.. స్వచ్ఛమైన ఇంటి భోజనాన్ని.. ఎంతో నాణ్యతతో జనాలకు అందిస్తోంది ఓ హోటల్. అది కూడా ముప్పై ఏళ్లుగా. ఈ జనం మెచ్చిన హోటల్‌కు భారత ప్రభుత్వం (మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌) నుంచి రీజినల్‌ హెడ్‌ ఆఫీసు హైదరాబాద్‌ ద్వారా అవార్డు కూడా వచ్చిందంటే.. ఆ హోటల్ గురించి పక్కా తెలుసుకోవాల్సిందే.


వరంగల్‌ జిల్లా నర్సంపేట నడిబొడ్డున ముప్పై ఏళ్లుగా.. ఉప్పలయ్య హోటల్ నడుస్తోంది. 30 ఏళ్ల కింద.. ఉప్పలయ్య అనే వ్యక్తి.. తన ఇంట్లో నాణ్యమైన ఇంటి భోజనంతో చిన్న హోటల్ నడిపించేవాడు. ఆ హోటల్‌లో పెట్టే భోజనం తింటే.. అచ్చంగా మన ఇంట్లో అమ్మ చేతి వంట తిన్నంత తృప్తి దొరుకుతుందని.. టాక్. మరి ఇంత మంచి టాక్ ఉన్న హోటల్.. ఓ పెద్ద బిల్డింగులో, చమక్ చమక్ లైటింగ్, పెద్ద హోర్డింగులతో ఉంటుందనుకునేరు. అప్పుడు ఎలా అయితే.. ఉప్పలయ్య తన ఇంట్లో ఈ హోటల్‌ను ప్రారంభించారో.. ఇప్పటికి కూడా అదే ఇంట్లో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా హోటల్‌ను నడిపిస్తుండటం విశేషం. కనీయం ఉప్పలయ్య హోటల్ అని పెద్ద బోర్డు కూడా లేదు.. కేవలం గోడకే పెయింటింగ్‌తో రాసి ఉండటం ఆశ్చర్యం.


ఇక్కడ దొరికే.. రుచికరమైన, నాణ్యమైన భోజనానికి చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ రోజూ 150 నుంచి 200 మంది భోజనం చేస్తున్నారు. సాదా భోజనానికి రూ.90 తీసుకుంటున్నారు. వెజ్‌‌తో పాటు నాన్‌వెజ్‌ భోజనం కూడా దొరుకుతుంది. ఇంటి భోజనాన్ని తలపించేలా.. అది కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే అందిస్తుండటం ఈ ఉప్పలయ్య హోటల్ ప్రత్యేకత. ఇంటినే హోటల్‌గా నడిపించటమే కాదు.. ఇందులో ఎవరూ పనివాళ్లు ఉండరండోయ్. అక్కడ పనులు చేసేది అంతా ఆ కుటుంబసభ్యులే. అందుకే అది ఇంటి భోజనంగా ఫేమస్.


 


ఇక్కడికి వచ్చిన కస్టమర్లు.. కడుపునిండా తినటమే కాదు సంతృప్తిగా వెళ్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లయితే.. వీలైనప్పుడల్లా వెళ్లి భోజనాన్ని ఆస్వాధిస్తుంటామని చెప్తున్నారు. చుట్టుపక్కన ఉన్న పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు ఉప్పలయ్య హోటలే.. తమ ఇల్లు అనేంతగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.


ఈ హోటల్‌ను ఉప్పలయ్య కాలం చేసిన తర్వాత తన కుమారుడు శ్రీనివాస్ నడిపిస్తున్నారు. కుటుంబసభ్యులే స్వయంగా వంట చేస్తూ.. వాళ్లే వర్కర్లుగా ఉంటారు. ఒక చిన్న ఇంట్లో నడిపిస్తున్న ఈ హోటల్‌‌కు సంబంధించి ఎలాంటి రీల్స్, వీడియోలు, ప్రకటనలు లేకుండానే.. కేవలం మౌత్ టాక్‌తోనే దాని ఘుమఘుమలు చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. నర్సంపేటకు వెళ్లి ఎవ్వరిని అడిగినా ఉప్పలయ్య హోటల్ గురించి చెప్తారంటే.. 30 ఏళ్లుగా ఆ హోటల్‌ కాపాడుకుంటున్న నమ్మకం అలాంటిది.


‘వైఎస్ తన కొడుకని కూడా చూడలేదు’.. లక్ష్మీపార్వతి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ


అయితే.. ఈ హోటల్‌లో రెండు నెలల కిందట మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ సభ్యులు భోజనం చేశారు. బాగుందని కాప్లిమెంట్ ఇచ్చి వెళ్లిపోయారు. అందరూ చెప్పినట్టే చెప్పారనుకున్నారు. కట్ చేస్తే.. సోమవారం (ఆగస్టు 12న) మళ్లీ వచ్చి హోటల్‌లో ఇదే నాణ్యత కొనసాగించాలంటూ.. కేంద్ర ప్రభుత్వ అవార్డును అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa