ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్వాల జిల్లా ఘోర ప్రమాదం .. నిద్రిస్తుండగా గోడ కూలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 10:08 AM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయిజలోని 14 వార్డులలో చాకలి నరసింహులు తన కుటుంబ సభ్యులతో రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి భోజనం అనంతరం గుడిసెలు నిద్రపోయారు.నర్సింహులుకు భార్య ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా మధ్యరాత్రి గుడిసె గోడ కూలి మీద పడడంతో భార్యకు, తన చిన్న కూతురుకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన ఏపీలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఆ ఇద్దరిని తరలించారు. నర్సింహులు చిన్న కూతురు శ్రీకృతి (8) హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.భార్య పరిస్థితి కూడా ఇంకా తీవ్రంగా ఉంది. సోమ, మంగళవారం కురిసిన భారీ వర్షానికి అయిజ పట్టణం పూర్తిగా జల జలమయం అయింది. భారీ వర్షానికి నర్సింహులు నివాసం ఉన్న గుడిసె దెబ్బతిని ఉండవచ్చు అని, చుట్టూ వర్షపు నీరు ఉండడంతో గుడిసె గోడ కూలి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని అయిజ పట్టణ వాసులు కోరుతున్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa