ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితులకు...నెలజీతం ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 03:33 PM

తెలంగాణ వరద బాధితులకు భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విరాళం ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు.'వరద బాధితులను ఆదుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపడుతున్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని హరీశ్‌రావు 'ఎక్స్‌'లో పేర్కొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa