ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య సేవలను వేగవంతం చేయాలి.. రోగులకు రాకుండా చూడాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 03:58 PM

జ్వరంతో ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లను ఆలస్యం చేయకుండా వెంటనే రాపిడ్ టెస్ట్ చేసి డెంగ్యూ పరీక్ష నిర్వహించి  ట్రీట్మెంట్ అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గజ్వేల్ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఔట్ పేషెంట్ రిజిస్టర్, రక్త పరీక్షల ల్యాబ్, జర బాధితుల చికిత్స గది, మందులగది, డయాలసిస్, ఎస్ఎన్ సియు చిల్డ్రన్స్ వార్డులను తనికి చేసి రోగులకు అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడి నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని త్వరలోనే వ్యాధులు నయమస్తాయని తెలిపారు. వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున  ఆస్పత్రిలోని వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఆసుపత్రికి వివిధ జ్వరాలతో వచ్చిన వారికి  ఆలస్యం చేయకుండా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి డెంగ్యూ నిర్ధారణకు ఎలిసా టెస్ట్ పంపించి  వైద్య సేవలు అందించాలని అన్నారు.
మెడిసిన్ స్టోర్ లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఏదైనా మెడిసిన్ పూర్తిగా అయిపోక ముందే స్టాక్ తెప్పించుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పైరీ అయిన మందులను ఉపయోగించరాదని ఉన్నారు. నాలుగు సైకిల్స్ లలో అందిస్తున్న డయాలసిస్ సేవలు  ఆస్పత్రి పరిధిలో నమోదైన 80 మంది డయాలసిస్ పేషెంట్లకు ప్రతిరోజు 5 సైకిల్స్ చొప్పున  40 మందికి డయాలసిస్ నిర్వహించాలని, ఎస్ ఎన్ సి ఎల్ చిన్నపిల్లల వార్డులో అప్రమత్తంగా ఉండి నవజాత శిశువులకు  ఇంక్యుబేటర్ సేవలు అందించాలని, ఆసుపత్రిలో సానిటేషన్ కార్యక్రమాలు రెగ్యులర్ గా నిర్వహించి ఆస్పత్రిని  పరిశుభ్రంగా ఉంచాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ సాయి కిరణ్  ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట గజ్వేల్ ఆర్డీవో బలిసిలాల్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, తాసిల్దార్, ఎంపీడీవో ఉన్నారు....






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa