ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగర్ కర్నూల్ జిల్లాలో *జిల్లాలో భారీ వర్షాలకు వరద నష్టాన్ని అంచనావేయండి*

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 04:02 PM

భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లాలో వరద నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పించాలని, సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు,మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరములో  భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఆస్తి నష్టం,ప్రాణనష్టం,పంట నష్టం, వివరాలను శాఖల వారీగా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల పంట నష్టం వాటిల్లిందో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి  నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
జిల్లాలో ఇప్పటివరకు ఎంతమందిని రెస్క్యూ చేసి కాపాడారో పూర్తి వివరాలతో పాటు,పశువులు,పాఠశాలలు ఆసుపత్రుల డ్యామేజీ వివరాలను సైతం అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటుచేసిన రిలీఫ్ క్యాంపుల వివరాలను సైతం వెల్లడించాలని సూచించారు. ముఖ్యంగా ఆర్ అండ్ బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్ల నష్టంతోపాటు కల్వర్ట్ లు , బిడ్జిల నష్టాన్ని కూడా వెల్లడించాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో అకాల వర్షాల వలన వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు. జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు. జిల్లా వ్యాప్తంగా గత నెల 30వ తేదీ నుండి సెప్టెంబర్ రెండో తేదీ వరకు జిల్లాలో 20.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు.పంచాయతీరాజ్ -- రోడ్లు ,ఆర్ అండ్ బి-- రోడ్లు ఎంత మేరకు దెబ్బతిన్నాయో నివేదికలు అందజేయాలని  చెప్పారు.ఏమైనా చెరువులు,  కెనాల్ లు, బ్రిడ్జిలు దెబ్బతిన్న వివరాలను ఇరిగేషన్ శాఖ సమర్పించాలన్నారు. జిల్లాలో ఏమైనా ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతిన్నాయో విద్యాశాఖ నుంచి వివరాలను సేకరించాలని సూచించారు.జిల్లాలో తహసిల్దార్లు,ఎంపీడీవోలతో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఇండ్లు కూలినవి  సమగ్ర వివరాలు తెలియపరచాలన్నారు.ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని,జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే  విద్యుత్ పునరుద్ధరణకు వెంటనే చర్యలు చేపట్టాలని  విద్యుత్ అధికారులను ఆదేశించారు.   ఆర్ డబ్ల్యూ ఎస్ విభాగం ద్వారా సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.మండల అభివృద్ధి అధికారులు,పంచాయతీ సెక్రటరీలు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని సంబంధిత  డిపిఓ ను ఆదేశించారు.వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు,కలెక్టరేట్ ఏవో సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa