ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి పొన్నం ప్రభాకర్ కి నిధుల మంజూరు గురించి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 24, 2024, 11:38 AM

మహబూబాబాద్ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ను మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తొర్రూరు పట్టణ బస్టాండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొర్రూరు పట్టణం  వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, సూర్యాపేట, నర్సంపేట, మహబూబాబాద్, జిల్లాలకు ప్రధాన కూడలిగా ఉండి మారుమూల గ్రామాలు తండాలతో తొర్రూరు పట్టణం  విస్తరించడంతో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని, జిల్లా స్థాయికి తగ్గట్లుగా తొర్రూర్ డివిజన్ కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని  మంత్రి పొన్నం కి వివరించినట్లు  చెప్పడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa