ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులి దాడిలో చనిపోయిన ఆవు యజమానికి సహాయం నగదు అందజేత...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 05, 2025, 01:31 PM

చీలపల్లి గ్రామానికి చెందిన గోనె శ్రీనివాస్ యొక్క ఆవు అటవీప్రాంతంలో మేతకు వెళ్ళి పెద్దపులి దాడిలో మరణించింది. అటవీ అధికారులు సమాచారం అందుకుని పంచనామా నిర్వహించి బాధితునికి ఎఫ్ఆర్ఓ ఇక్బాల్ హుస్సేన్ చేతుల మీదుగా తక్షణ సహాయం కింద ఐదు వేల రూపాయలు అందజేశారు.
ఎఫ్ఆర్ఓ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ అడవిజంతువుల దాడిలో పశువులు చనిపోతే వెంటనే సమాచారం అందించాలని, వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ మోహన్ రావు, బీట్ ఆఫీసర్లు సంతోష్, అరుణ్ రెడ్డి, అరవింద్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa