ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 07:52 PM

విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది నెలల గర్భిణిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. నిండు చూలాలు అని కూడా చూడకుండా ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. విశాఖపట్నంలోని మధురవాడ ఆర్టీసీ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జ్ఞానేశ్వర్, అనూష గాఢంగా ప్రేమించుకున్నారు. మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం పాటు వారి సంసారం సాఫీగానే నడిచింది. కానీ ఆ తర్వాత మనస్ఫర్ధలు మొదలయ్యాయి. ప్రేమ కాస్తా కోపంగా మారుతూ వచ్చింది. అయితే అనూష గర్భవతి అయ్యింది. ఇటీవలే ఫోటోషూట్ కూడా నిర్వహించారు.


సోమవారం ఏమైందో తెలియదు.. అనూష, జ్ఞానేశ్వర్ మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రమై.. కోపంలో, క్షణికావేశంలో భార్య గొంతు నులిమాడు జ్ఞానేశ్వర్. నిండు చూలాలనే సంగతి కూడా మరిచి గట్టిగా గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా.. అప్పటికై అనూష చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం జ్ఞానేశ్వర్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను గొంతు నులిమినట్లు అంగీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యా్ప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక విషయం తెలిసిన అనూష కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జ్ఞానేశ్వర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com