ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి.. ఆపై శవంపై డ్యాన్స్ వేసి

Crime |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 10:51 PM

హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన సమాజంలో మానవ విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో కళ్లకు కడుతోంది. షాపు అద్దె చెల్లించమని అడిగినందుకు 70 ఏళ్ల వృద్ధురాలు కమలాదేవిని ఒక యువకుడు దారుణంగా హత్య చేయడమే కాకుండా.. ఆపై ఆమె మృతదేహంపై నృత్యం చేయడం సభ్య సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఏప్రిల్ 11న జరిగిన ఈ దుర్ఘటన స్థానికులకు తెలిసిన తర్వాత వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


హత్యకు గురైన ఆమె రాజస్థాన్ నివాసి. చాలా సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివసిస్తోంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం.. ఆమె తన భర్తతో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. భర్త 15 సంవత్సరాల క్రితం మరణించాడు. హత్యకు గురైన కమలాదేవి రాజస్థాన్‌కు చెందినవారు. 30 ఏళ్ల క్రితమే ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. 15 ఏళ్ల క్రితం భర్త మరణించగా.. ఆమె ఒంటరిగా ఉంటున్నారు. తన భర్త నుంచి వారసత్వంగా వచ్చిన షాపులను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆమె జీవనం సాగించేవారు. ఆమె షాపులోనే ఆ యువకుడు అద్దెకు ఉంటున్నాడు.


దీనిలో భాగంగానే షాపు అద్దె చెల్లించమని అడిగినందుకు ఆ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని అదే షాపులో ఉంచి.. తాళం వేసి అక్కడ నుంచి పారిపోయాడు. రెండు రోజుల తర్వాత చుట్టుపక్కల ఉంటున్న వారు కమలా దేవి ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. అతడు తీసిన వీడియాలు బెంగళూరులో వైరల్ కావడంతో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒక మైనర్ బాలుడు ఉండటం విశేషం.


ఒక వృద్ధురాలి పట్ల కనీస గౌరవం చూపకుండా.. ఆమె ప్రాణాలు తీయడమే కాకుండా.. మృతదేహంపై వికృత చేష్టలకు పాల్పడటం నేటి యువతలో కొందరు ఎంతగా దిగజారిపోతున్నారో తెలియజేస్తోంది. కుటుంబ వ్యవస్థలో సరైన పెంపకం లేకపోవడం.. సమాజంలో పెరిగిపోతున్న నేర సంస్కృతి, చట్టాల పట్ల భయం లేకపోవడం వంటి అనేక కారణాలు ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నాయి.


ఇలాంటి సైకోలను కఠినంగా శిక్షించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. చట్టాలు మరింత కఠినంగా ఉండాలని.. నేరస్తులకు భయం కలిగేలా శిక్షలు విధించాలని కోరుతున్నారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించడానికి కుటుంబాలు.. విద్యా సంస్థలు , సమాజం మొత్తం కృషి చేయాల్సిన అవసరం ఉంది. యువతలో మానవత్వం, గౌరవం వంటి విలువలను పెంపొందించడం ద్వారానే ఇలాంటి దారుణాలను నివారించగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com