ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భాజపాతో పొత్తుపై జగన్‌ స్పష్టత ఇవ్వాలి: మంత్రి నక్కా ఆనందబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 03:29 PM

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోన్న శ్వేతపత్రాలపై అభ్యంతరాలుంటే వైకాపా నేతలు చర్చకు సిద్ధం కావాలని మంత్రి నక్కా ఆనందబాబు సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు నాలుగేళ్లలో చేశామన్నారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని శ్వేతపత్రాల ద్వారా స్పష్టంగా వివరిస్తున్నామని చెప్పారు. వైకాపా బ్లాక్ పత్రాలు విడుదల చేస్తే.. ప్రజలే వారిని ప్రశ్నిస్తారన్నారు. జైలు జీవితాలు, నల్ల కాగితాల సంస్కృతి వైకాపాదేనని.. క్విడ్ ప్రోకో లాంటి పదాలు వైకాపా అధ్యక్షుడు జగన్ వల్లే తెలిశాయని ఆయన ఎద్దేవా చేశారు. భాజపాతో పొత్తుపై జగన్ ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని మంత్రి ఆనందబాబు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa