ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఘనంగా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. క్రిస్మస్ పర్వదిన వేడుకలకు అన్ని చోట్ల క్రైస్తవులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. చర్చిలన్నీ మస్తాబు చేశారు. ప్రపంచంలో ముందు అస్ట్రేలియాలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అలాగే జపాన్, సింగపూర్, మలేషియాలోను క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. 24వ తేదీ అర్ధరాత్రి నుంచి వేడకలు నిర్వహించేందుకు దేశంలోని చర్చిలన్ని ముస్తాబు చేశారు. రాత్రి చర్చిల్లో ప్రార్ధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక క్రైస్తవుల ఆరాధ్య ప్రాంతమైన వాటికన్ సిటీలోనూ క్రిస్మస్ సందడి మొదలైంది.
రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్, ప్రధాని మోదీ దేశ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమను, శాంతియుత సహజీవనం, సహనం, శత్రువుల పట్ల క్షమాగుణం.. ఇవన్నీ మానవాళికి క్రీస్తు తన జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలని ఆయన గుర్తు చేశారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa