ఫోనులో పరిచయం అయ్యాడు... తోడుంటానన్నాడు.. ఆపై రూ.1.40లక్షలకు శఠగోపం పెట్టాడు. మహిళను మోసగించి నగదు కాజేసిన వ్యక్తిపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఐదో వార్డుకు చెందిన వితంతువు కరణం గంగాభవానీకి జనవరి 2019న శ్రీకాకుళంకు చెందిన సమీర్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఆమెను మభ్యపెట్టాడు. భర్తను కోల్పోయిన ఆమెకు తోడుంటానని అవసరం అయితే వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో తాను ఇబ్బందుల్లో వున్నానని, కొంత డబ్బులు పంపితే అవసరం తీరగానే తిరిగి ఇచ్చస్తానని సమీర్ గంగాభవానీని నమ్మించాడు. తన ఫ్రెండ్ అకౌంట్కు డబ్బులు వేయమని చెప్పడంతో గంగాభవానీ మొదటి సారి రూ.30వేలు నగదు అతనికి పంపింది. తర్వాత దఫదఫాలుగా రూ.1.40 లక్షలు అతని అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. తిరిగి డబ్బులు అడిగితే సమీర్ ఫోన్ ఎత్తడం మానేశాడు. 20 రోజులుగా అతని అన్ని సెల్ నెంబర్లూ ఆఫ్ లోనే వున్నాయని గంగాభవానీ తెలిపింది. సమీర్ తనను మోసగించాడని అర్థం చేసుకున్న గంగాభవానీ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సమీర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎండీ నబీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa