అను నిత్యం ఏదో ఒక వివాదంలో పడటం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బాగా అలవాటైనట్టే కనిపిస్తోంది. తాజాగా యోగి ఆదిత్యనాథ్ దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనం కావడానికి మొగల్స్, బ్రిటిషర్లు కారణమంటూ ఇచ్చిన స్టేట్ మెంటే ఇప్పుడు షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకటే కామెంట్లు.. సెటైర్లు మించిపడుతున్నాయి. ఐనా స్వాతంత్య్రం వచ్చి గిన్ని సంవత్సరాలు అవుతుంటే.. ఎప్పుడో 12 వ శతాబ్దంలో వచ్చిన మెగల్స్, 70 ఏండ్ల కిందనే వెళ్లిపోయిన బ్రిటీషు వారు భారత ఆర్థిక వ్యవస్థ బలహీనానికి కారణమంటూ మాట్లాడటంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. అసలు 70 ఏండ్లుగా పాలన చేసిన కాంగ్రెస్, బీజేపీ, తదితరులు ఈ దేశానికి ఏమి చేశారంటూ విరుచుకుపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa