తన రచనలతో సమాజాన్ని చైతన్యపరిచి, సమాజంలోని రుగ్మతలను రూపుమాపిన గొప్ప వ్యక్తి గుర్రం జాషువా అని మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన రచనలు, కవితాఖండికలతో పండిత, పామరులను రంజింపచేసిన జాషువా, తన కలంతోనే సమాజంలోని అసమానతలను తొలగించడానికి విశేష కృషి చేశారని డొక్కా తెలిపారు. గుర్రం జాషువా మన గుంటూరులో జన్మించడం మనందరికీ గర్వకారణమన్న ఆయన, ఆ మహనీయుడు జన్మించిన ప్రదేశాన్ని గొప్పచారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి గత ప్రభుత్వం పూనుకుందన్నారు. ఆ సాహితీకారుడి సేవలను గుర్తించి, ఆయనను సదాస్మరణం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత నేటితరంపై ఎంతో ఉందని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa