ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వేదిక నుంచే జవాబిస్తాం ... భారత్‌

national |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 03:52 AM

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రస్థాయిలో విషం కక్కడంతో భారత్‌ దానికి దీటైన జవాబివ్వాలని నిర్ణయించుకుంది. అదే సర్వప్రతినిధి సభ వేదిక నుంచి తన సమాధానాన్ని వినిపించనుంది. సర్వప్రతినిధి సభ నిబంధనల్లోని రైట్‌ టు రిప్లై క్లాజ్‌ను ఉపయోగించుకోనున్నట్లు ఐరాస అధికారులకు అధికారికంగా తెలియజేసింది.
భారత్ పై విషం చిమ్మిన పాక్ కు ఆమె ధీటుగా బదులు చెప్పారు.ఈ విషయమై ఈరోజు ఆమె స్పందిస్తూ.. భారత ప్రధాని మోడి ప్రసంగానికి, పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రసంగానికి ఎంతో తేడా ఉందని అన్నారు. యుద్ధానికి సిద్ధం అనే సందేశాన్ని ఇచ్చి ఇమ్రాన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు.పాక్ ప్రధాని ఓ యుద్ధోన్మాదిలా మాట్లాడారని విమర్శించారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన 25 ఉగ్రవాద సంస్థలు, 130 మంది ఉగ్రవాదులు పాక్ లో ఉన్న విషయాన్ని ఇమ్రాన్ ధ్రువీకరిస్తారా? ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు పింఛన్ ఇస్తున్న ఏకైక దేశం పాక్ అనే విషయాన్ని ఆ దేశం గుర్తించిందా? ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేయకపోతే న్యూయార్క్ లోని హబీబ్ బ్యాంకును ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో పాక్ వివరించగలదా? పాక్ ను ఎఫ్ఏటీఎఫ్ ఎందుకు నోటీసులో పెట్టిందో ప్రపంచ దేశాలకు వివరించగలదా? న్యూయార్క్ లో బిన్ లాడెన్ ను సమర్థించిన విషయాన్ని ఇమ్రాన్ ఖండించగలరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa