వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. మరో వైపు ముఖ్యమంత్రి జగన్పై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ పాలనపై మాట్లాడుతూ.. సీఎం పీఠం అదిరోహించిన వైఎస్ జగన్ నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సంచలనం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మరో వైపు చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు శవ రాజకీయాలు కొత్తేమి కాదని.. ఎన్టీఆర్ నుండి కోడెల వరుకు శవ రాజకీయాలు మానుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. అయిదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వేలేదని.. జగన్ పాలనపై ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అక్రమ కట్టడంలో ఉండటానికి నీకు సిగ్గు లేదా చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ఇల్లు కట్టుకోవడానికి నీకు స్తోమత లేకుంటే చెప్పు చంద్రబాబు అత్తగా నీకు నేను ఇల్లు కట్టిస్తా అంటూ కౌంటర్ వేశారు లక్ష్మి పార్వతి. మరి ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa