ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తితిదే పాలక మండలి సభ్యులుగా నేరగాళ్లను నియమించింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 04:24 AM

తితిదే పాలక మండలి సభ్యులుగా నేరగాళ్లను నియమించారని తెదేపా సీనియర్ నేత, శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు విమర్శిం చారు. శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. సీబీఐ విచారణను ఎదిరిస్తున్న, నేర చరితుల్ని తితిదే పాలక మండలి సభ్యులుగా నియమించారన్నారు. తిరుమల ఆలయ పవిత్రతను ప్రభుత్వం కాలరాస్తోందని ఆక్రోశించారు. శేఖర్ రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్గా నియమించారని వైకాపా నేత విజయ సాయి రెడ్డి గతంలో ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్ని కోట్లు తీసు కుని ఆయనను పాలక మండలి సభ్యుడుగా నియమించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పచ్చ రాయి తిరుమలలో లేదని జేఈవో ధర్మారెడ్డి విలే ఖరులకు చెప్పారు. దీని గురించి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన వారిపై స్వయం ప్రేరిత కేసు దాఖలు చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa