మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే స్పష్టత ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ తో 'కలిసే పనిచేయబోతున్నాం. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తాం' అని చెప్పారు. పొత్తుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న దానిపైనే తాము కసరత్తు చేస్తున్నామని చెప్పారు. బీజేపీతో పొత్తుపై ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన ఉండవచ్చని చెప్పారు.
శనివారంనాడు ముంబై లో జరిగిన శివసేన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో సీట్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, కొన్ని సీట్ల విషయమై అవగాహనకు రావాల్సి ఉందని చెప్పారు. రెండు భాగస్వామ్య పార్టీల మధ్య సమానాధికారం ఉంటుందనే సంకేతాలు కూడా ఉద్ధవ్ థాకరే ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసైనికుడు పగ్గాలు చేపట్టే రోజు వస్తుందని తాను శివసేన సుప్రీం బాలాసాహెబ్కు వాగ్దానం చేసినట్టు థాకరే చెప్పారు.
కాగా, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ-శివసేన మధ్య అవగాహన కుదిరినట్టు శివసేన ఇప్పటికే పలుమార్లు చెప్పింది. ఆ ప్రకారం కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు బీజేపీ, శివసేన పంచుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, తొలి రెండున్నరేళ్లు శివసేనకే సీఎం పగ్గాలు ఇవ్వాలనేది తమ డిమాండ్గా ఉన్నట్టు కూడా చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa