ఇసుక కొరత వలన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఇసుక కొరత పై కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధికార పార్టీ వైసీపీ పై ఒత్తిడి తెస్తున్నారు. సాంకేతిక కారణాల వలన మరియు వరదల ప్రభావం వలన ఇసుకని తీయడం కుదరట్లేదని ప్రభుత్వం ఎపుడో వెల్లడించింది. అయితే జగన్ ఇసుక కొరత విషయం లో మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబందించిన ఆర్డినెన్స్ మరో రెండు మూడు రోజుల్లో రానుందని తెలుస్తుంది.
అయితే ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇసుకని బ్లాక్ చేసినా, ఎక్కువ ధరకి అమ్మినా, సరిహద్దులు దాటించిన జైల్లో పెడతారు. ఈ విషయం పట్ల అందరు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులని కోరారు. అయితే వరదల ఉదృతి తక్కువగా వున్న చోట నుండి అధిక ఇసుకని తీయాలని జగన్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న వాటిని విమర్శించడం తోనే విపక్షాలు, విమర్శకులు కాలక్షేపం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa