గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనకే ఇపుడు రివర్స్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వైజాగ్ లో నిర్వహించిన లాంగ్ మార్చ్ పై మంత్రి బాలినేని శ్రీనివాసులు విమర్శలు చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత పై చేసింది లాంగ్ మార్చ్ కాదు రాంగ్ మార్చ్ అని అన్నారు. అయితే గత ప్రభుత్వం చంద్రబాబు హయం లో ఇసుక విషయం లో జరిగిన అవినీతి పై పవన్ నోరు మెదపలేదని, చోద్యం చూస్తూ వున్నారని అన్నారు. అయితే చంద్రబాబు అడుగు జాడల్లో నడిచే పవన్ కళ్యాణ్ కి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా అర్ధం కాలేదని ఎద్దేవా చేసారు.
ఇసుక కొరత పై విశాఖపట్టణం లో జరిపిన బహిరంగ సభ లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ కి గుర్తు చేసారు. జగన్ పరిపాలన మంచిగా చేస్తే తమ పని తాము చేసుకుంటామని, ఇలా నిరసనలు, బహిరంగ సభలు చేయాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్నీ గుర్తు చేసారు. జగన్ పరిపాలన బాగుంది కాబట్టే అయన ఇపుడు సినిమాలు మొదలు పెడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa