రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థుల కు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. జనవరి నుంచి మే నెల వరకు వివిధ దశల్లో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష పై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆంగ్ల భాష నైపుణ్యాలను పిల్లలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఆంగ్ల భాష నైపుణ్యం పిల్లలకు అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచే అవకాశం ఉంది. ఆంగ్ల భాషలో బోధించేందుకు 98 వేల మంది ఉపాధ్యాయులు అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 62.36 శాతం మాత్రమే ఆంగ్ల భాష అభ్యసిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల భాషల్లో విద్యార్థులకు బోధన అందిస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యము ప్రతిభ బయట పడుతుంది. తెలుగు భాష వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కచ్చితంగా అన్ని అంశాల్లో తెలుగు భాషను కూడా బోధిస్తాం. ఆంద్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ అనడం సమంజసం కాదు. ఎవరైతే వార్తలు రాస్తున్నారో వారి పిల్లలు ఆంగ్లంలో మాట్లాడటం లేదా అన్నారు. వారు కేవలం తెలుగు మీడియం చదువుతున్నారా అని మంత్రి సురేష్ అనుమానం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa