ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు అమరావతిలో వామపక్షాల పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 25, 2019, 03:37 PM

తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ పార్టీ 95వ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ నేత కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాజధాని రైతులకు వామపక్షాలు అండగా ఉంటాయని అన్నారు. సీపీఐ 95వ వార్షికోత్సవాలను ఏపీ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి భవన్ వద్ద ఎర్రజెండా ఎగరవేయనున్నారు. అలాగే 95వ వ్యవస్థాపక దినోత్సవంలో అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపీ సర్కార్ నయంతృత్వ పోకడలను అడ్డుకొని తీరుతామని రామకృష్ణ ప్రకటించారు. అమరావతిలో రేపు వామపక్షాల పర్యటన ఉంటుందని తెలిపారు. ఇది 29 గ్రామాల ప్రజల ఆందోళన కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల ఆవేదన అని రామకృష్ణ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa