ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నవారు తాము ఏమి చేశామన్న అంశాన్ని పునర్ ఆలోచించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. లక్నోలో ఇవాళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులదే అని ప్రధాని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లో భారీ హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ హింసలో ప్రజా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ.. తాము చేసింది ఎంత వరకు కరెక్ట్ అన్న అంశాన్ని ఆందోళనకారులు ఆలోచించుకోవాలన్నారు. ఆర్టికల్ 370, రామ జన్మభూమి లాంటి అంశాలను శాంతియుతంగా పరిష్కరించామని, మూడు దేశాల శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలన్న బిల్లు కూడా క్లియర్ అయ్యిందని, 130 కోట్ల మంది భారతీయులు అలాంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నట్లు మోదీ చెప్పారు.
లక్నోలో వాజ్పేయి మెడికల్ వర్సిటీ కోసం ప్రధాని శంకుస్థాపన చేశారు. నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇటీవల పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యూపీలోని రాంపూర్లో భారీ విధ్వంసం జరిగింది. అక్కడ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే ఆస్తులను ధ్వంసం చేసిన 28 మంది ఆందోళనకారులకు యూపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారి నుంచి 14.86 లక్షలు నష్టపరిహారంగా కోరింది. హింసకు దిగే వారి ఆస్తులను జప్తు చేస్తామని ఇటీవల సీఎం యోగి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa