ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సచివాలయ చుట్టపక్కలా ఇళ్ల వారికి పోలీసుల నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 25, 2019, 06:31 PM

ఏపీలో మందడం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలోని ఇళ్ల వారికి పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఈ నెల 27 సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొత్త వ్యక్తులను ఇళ్లలో ఉంచుకోవద్దని పోలీసులు నోటీసులో సూచించారు. ఎవరైనా కొత్త వాళ్లు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు నోటీసులో పేర్కోన్నారు. ఈ నెల 27న జరిగే మంత్రిమండలి సమావేశంలో మూడు రాజధానుల నివేదికపై చర్చించనున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత రాజధాని మార్పుపై ప్రకటన చేయనున్నారు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa