ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకులో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 01:34 PM

కృష్ణా: ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగస్తులు తిరువూరు పట్టణంలో ధర్నా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం వలన సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దేశంలో ఎంతో మంది ప్రజలుప్రభుత్వ బ్యాంకుల మీద నమ్మకంతో జమ చేసుకున్న నగదుకు భద్రత లేకుండా పోయే అవకాశం ఉంది. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ వలన వడ్డీ రేట్లు బ్యాంకు చార్జీలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలపై భారం పడే అవకాశం ఉంది అని. వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అని. ప్రభుత్వ బ్యాంకులు వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతులకు రుణ సౌకర్యాలు అందిస్తుంది. తిరువూరు నియోజకవర్గ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa