ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోఠి లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో మహా ధర్నా

national |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 01:49 PM

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ... దేశవ్యాప్తంగా  ఉద్యోగులు తలపెట్టిన సమ్మె రాష్ట్రంలోనూ కొనసాగుతోంది. ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రమంతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులూ నిరసనలో పాల్గొంటున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో కోఠి లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో మహా ధర్నా నిర్వహించారు. హనుమకొండలో యూనియన్  బ్యాంక్  ఆఫ్  ఇండియా వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు. మహబూబాబాద్ లో  పట్టణ వీధుల్లో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. 


ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకుల ప్రైవేటీకరణ జరగనివ్వమని ఖమ్మంలో ఆందోళన చేశారు. లాభాల బాటలో పయనిస్తున్న బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం సహించబోమని  స్పష్టం చేశారు. కేంద్రం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa