ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ సీఎం జగన్ నజరాన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 07:36 PM

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా కిడాంబి శ్రీకాంత్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. శ్రీకాంత్ కు  రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయింపు చేస్తున్నట్లు ఈ సందర్భంగా  ము‍ఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శాప్‌ ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa