ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాజానికి స్పూర్తినిచ్చారు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 10:50 PM

అల్లరుముద్దుగా పెంచుకొన తమ కూతరు చనిపోయింది. దీంతో వారు చలించిపోయారు. కానీ తమ కూతురు అవయదానం చేసి నలుగురిలో ఆమెను చూసుకోవాలన్న ఆలోచనను తల్లిదండ్రులకు ఓ వైద్యుడు కలిగించాడు. దీంతో వారు సరేనని ముందుకొచ్చి సమాజానికి మంచి సందేశం అందించే ప్రయత్నం చేశారు. వివరాలలోకి వెళ్లితే...చండీఘడ్‌లోని ఐదేళ్ల బాలిక బ్రైయిన్‌ డెడ్‌ అయ్యి చనిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకుని మరి తల్లిదండ్రులు అవయదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అయితే ఆ బాలిక డిసెంబర్‌ 22న ఎత్తు నుండి పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణల కోసం పోరాడి చనిపోయింది. ఈ చిన్నారి ప్రాణాలతో బయటపడదని గ్రహించిన పీజీమర్‌ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు ఆ చిన్నారి తండ్రిని సంప్రదించారు. అయితే ఆ తండ్రి ఎంతో గుండె నిర్భారాన్ని ప్రదర్శించి అవయదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో ఆ బాలిక శరీరం నుంచి  గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్‌ వంటి అవయవాలను తీసుకున్నారు. దీంతో ముంబై, ఢిల్లీలో ఒక్కొక్కరు చండీఘడ్‌లోని ఇద్దరికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ క్రమంలో పీజీమర్‌  డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్ ఎంతో ధైర్యంతో ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన ఆ బాలిక కుటుంబాన్ని ప్రశంసించడమే కాక ఇలాంటి చైతన్యం ఎందరో రోగుల ఆశాకిరణాన్ని నిలబెట్టడానికి దోహదడుతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa