అల్లరుముద్దుగా పెంచుకొన తమ కూతరు చనిపోయింది. దీంతో వారు చలించిపోయారు. కానీ తమ కూతురు అవయదానం చేసి నలుగురిలో ఆమెను చూసుకోవాలన్న ఆలోచనను తల్లిదండ్రులకు ఓ వైద్యుడు కలిగించాడు. దీంతో వారు సరేనని ముందుకొచ్చి సమాజానికి మంచి సందేశం అందించే ప్రయత్నం చేశారు. వివరాలలోకి వెళ్లితే...చండీఘడ్లోని ఐదేళ్ల బాలిక బ్రైయిన్ డెడ్ అయ్యి చనిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకుని మరి తల్లిదండ్రులు అవయదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అయితే ఆ బాలిక డిసెంబర్ 22న ఎత్తు నుండి పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణల కోసం పోరాడి చనిపోయింది. ఈ చిన్నారి ప్రాణాలతో బయటపడదని గ్రహించిన పీజీమర్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు ఆ చిన్నారి తండ్రిని సంప్రదించారు. అయితే ఆ తండ్రి ఎంతో గుండె నిర్భారాన్ని ప్రదర్శించి అవయదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో ఆ బాలిక శరీరం నుంచి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ వంటి అవయవాలను తీసుకున్నారు. దీంతో ముంబై, ఢిల్లీలో ఒక్కొక్కరు చండీఘడ్లోని ఇద్దరికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ క్రమంలో పీజీమర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్ ఎంతో ధైర్యంతో ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన ఆ బాలిక కుటుంబాన్ని ప్రశంసించడమే కాక ఇలాంటి చైతన్యం ఎందరో రోగుల ఆశాకిరణాన్ని నిలబెట్టడానికి దోహదడుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa