ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 తగ్గింపు..కానీ టూ వీలర్స్ కే

national |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 10:52 PM

ధరలు  మండుతున్న ఈ తరుణంలో పెట్రోల్ పై రూ.25 తగ్గింపు అంటే... ఇక ఎగిరి గంతేస్తాం. ఇలాంటి శుభవార్తను అందిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొంది. కానీ షరత్తులు వర్తిస్తాయని కూడా స్పష్టంచేసింది. టూవీలర్‌ వాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్‌పై భారీ రాయితీను ప్రకటిస్తూ జార్ఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలకు ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 25 రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం తెలిపారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని సోరెన్ చెప్పారు. టూవీలర్‌ వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని హేమంత్‌ సోరెన్‌ వెల్లడించారు. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజలుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డిజీల్‌ ధరలు సెంచరీ దాటేశాయి. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ రూ. 5, డిజీల్‌ రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జార్ఖండ్‌లో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌ ధరలపై భారీ ఊరటను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంతో పేద, మధ్య తరగతి ద్విచక్ర వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa