ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశాల నుంచి యూపీఐ పేమెంట్స్..ఇక నో టెన్షన్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 10:56 PM

ఇండస్‌ఇండ్ బ్యాంకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)తో జతకట్టి యూపీఐ ఐడీలు వాడుతూ భారత్‌కు సులభతరంగా పేమెంట్లు పేమెంట్లు పంపునుకొనే సదవకాశాన్ని తీసుకొచ్చాయి. విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగార్థం విదేశాలలో స్థిరపడి, ఇక్కడ ఉన్న వారికి డబ్బులు పంపించాలంటే వారికి కాస్త కష్టతరమే. భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ పెరిగినప్పటికీ.. వేరే దేశాల నుంచి భారత్‌కు డబ్బులు పంపించడం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా మనీని పంపుకోవచ్చు. యూపీఐ వాడుతూ ఇక ఇంటర్నేషనల్ పేమెంట్లు కూడా చేసుకోవచ్చు.


భారత్‌కు క్రాస్ బోర్డర్ రెమిటెన్స్‌ను సులభతరం చేసేందుకు ఇండస్‌ఇండ్ బ్యాంకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)తో జతకట్టింది. దీంతో యూపీఐ ఐడీలు వాడుతూ భారత్‌కు సులభతరంగా పేమెంట్లు చేసుకోవచ్చు. తన మనీ ట్రాన్స్‌ఫర్ ఆపరేటర్ పార్టనర్లకు కోసం ఈ ఫెసిలిటీని తీసుకొచ్చింది. క్రాస్ బోర్డర్ పేమెంట్లు, రెమిటెన్స్‌ల కోసం యూపీఐను తీసుకొచ్చిన తొలి బ్యాంకుగా ఇండస్‌ఇండ్ బ్యాంకు అవతరించింది. లబ్దిదారుల అకౌంట్లోకి క్రాస్ బోర్డర్ పేమెంట్ సెటిల్‌మెంట్ చేసేందుకు ఎన్‌పీసీఐ పేమెంట్స్ సిస్టమ్స్‌తో అనుసంధానమయ్యేందుకు మనీ ట్రాన్స్‌ఫర్ ఆపరేటర్లు ఇండస్‌ఇండ్ బ్యాంకు ఛానల్‌ను వాడుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa