ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో విస్ఫోటనం తప్పదు: కేంబ్రిడ్జ్ వర్సిటీ

national |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 10:57 PM

భారత్ త్వరలో పెను ప్రమాదం పొంచింవుందని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ తెలిపింది. గతంలో కూడా మన దేశశంలో ఏప్రిల్, మే నెలలో రెండో వేవ్ భారత్‌ను అతలాకుతలం చేసింది. రోజువారీ కేసులు 4 లక్షలు మార్క్‌కు చేరాయి. డెల్టా వేరియంట్ విజృంభించడంతో ఆరోగ్య సంరక్ష వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత, కరోనాతో చనిపోయినవారి మృతదేహాల అంత్యక్రియలు కోసం రోజుల కొద్దీ పడిగాపులు గాసిన ఘటనలు వెలుగుచూశాయి. అప్పట్లో కేంబ్రిడ్జ్ ఇండియా ట్రాకర్ రెండో వేవ్‌ను సరిగ్గానే అంచనా వేసింది. వ్యాక్సినేషన్ కవరేజ్ తగినంతగా పెరిగే వరకు భారతదేశంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు నెమ్మదించవని ఆగస్టులో అంచనా వేసింది. అక్టోబరు నాటికి దేశంలో కోటి డోస్‌లు పంపిణీ జరగ్గా.. అప్పటి నుంచి కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.


దాదాపు 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారత్‌లో ఓమిక్రాన్ వేరియంట్ మొదలైందని, కొద్ది రోజుల్లోనే కేసుల వృద్ధి రేటులో పెరుగుదల తీవ్రంగా ఉంటుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. కానీ, ఈ వేవ్ వ్యవధి తక్కువ కాలం ఉంటుందని పేర్కొన్నారు. ‘భారతదేశం రోజువారీ కేసులలో విస్ఫోటనం వృద్ధిని చూసే అవకాశం ఉంది.. తీవ్రమైన వృద్ధి దశ సాపేక్షంగా తక్కువగా ఉంటుంది’ అని కేంబ్రిడ్జ్ వర్సిటీ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ పాల్ కట్టుమన్ అన్నారు.భారత్‌ వ్యాప్తంగా ఇన్‌ఫెక్షన్ రేటు వేగంగా పెరుగుతున్నట్టు గుర్తించారు. డిసెంబరు 24 నాటికి ఆరు రాష్ట్రాల్లో వైరస్ ఆందోళనకరంగా ఉండగా.. వైరస్ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ట్రాకర్ ద్వారా గుర్తించగా.. డిసెంబరు 26 నాటికి 11 రాష్ట్రాలకు విస్తరించింది. దేశంలో బుధవారం 9,195 కొత్త కేసులు నమోదుకాగా.. రోజువారీ కేసులు మూడు వారాల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కేసులు 34.8 మిలియన్లుగా ఉన్నాయి. మరో 302 మంది కరోనాకు బలికాగా.. మొత్తం మరణాలు 480,592కు చేరాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 780కి చేరింది.


‘కొత్త వేరియంట్ కేసులో కొద్ది రోజుల్లో పెరగడం ప్రారంభిస్తాయి.. బహుశా ఈ వారంలోనే ఉండొచ్చు’అని అభిప్రాయపడ్డారు. అయితే, రోజువారీ కేసులు ఎంత ఎక్కువగా ఉంటాయో అంచనా వేయడం చాలా కష్టమని తెలిపారు. కోవిడ్-19 ఇండియా ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన కేంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధకులు దాని ఆధారంగా ఈ అంచనాలు రూపొందించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తున్నాయి. భారత్ కూడా ప్రికాషన్ డోస్ పేరుతో బూస్టర్ డోస్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జనవరి 1 నుంచి కొవిన్ యాప్ ద్వారా ప్రారంభమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa