ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థర్డ్ వేయ్ వచ్చేసిందా...ఆందోళన కలిగిస్తున్న కేసుల పెరుగుదల

national |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 11:05 PM

మన దేశంలో ఎప్పటినుంచో థర్డ్ వేయ్ రాకపై చర్చ సాగుతున్నా అది చాపకింద నీరులా మనదేశంలో వ్యాపిస్తోందా అన్నట్లుగా నేడు పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య చూస్తే అది నిజమేననిపిస్తోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల రెట్టింపవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వారిలో 241 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అత్యధికంగా నమోదయిన రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి వరుసలో ఉంది. ఏకంగా 238 కేసులు ఢిల్లీలో నిర్ధారణ అయ్యాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (163), గుజరాత్ (73) ఉన్నాయి. కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్థాన్‌లో 46, కర్ణాటకలో 34, తమిళనాడులో 34, హరియాణాలో 12, బెంగాల్‌లో 11 మధ్యప్రదేశ్‌లో 9 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.


మొత్తం బాధితుల్లో యాక్టివ్ కేసులు ఒక్క శాతం దిగువనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 0.22 శాతం ఉండగా.. మార్చి 2020 తర్వాత ఇదే అత్యంత స్వల్పం. మొత్తం 77,002 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సాధారణ కేసులు పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి హెచ్చరికలు జారీచేసింది. వ్యాక్సినేషన్‌తో పాటు టెస్టింగ్, ట్రేసింగ్ ముమ్మరంగా చేపట్టాలని సూచించింది. తాజాగా కేసులు పెరుగుదలతో థర్డ్ వేవ్‌ మొదలైందని భావిస్తున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.


మరోవైపు, సాధారణ కరోనా కేసుల్లోనూ పెరుగుదల నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,195 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ముందురోజుతో పోల్చితే ఇవి 44 శాతం అధికం. మంగళవారం 6,358 కేసులు బయటపడ్డాయి. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో 7,347 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,42,51,292కు చేరింది. దేశంలో రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. మహమ్మారికి మరో 302 మంది బలయ్యారు. ఇదిలావుంటే ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 143 వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ల పంపిణీ చేసిన దేశాల్లో భారత్ ముందు వరుసలో నిలిచింది. ఇదిలా ఉండగా, ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ఎక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుదల 11 శాతంగా ఉంది. అనేక దేశాలలో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతోందని, గతంలో ఆధిపత్యం చెలాయించిన డెల్టా వేరియంట్‌ను ఇప్పటికే అధిగమించిందని వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్‌డేట్‌లో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa