ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక్కడ నేరం చేసి...జర్మనీలో దొరికాడు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 11:04 PM

ఎటకేలకు నింధితుడు దొరికాడు. తద్వారా దేశంలో భారీ విధ్వంసం కుట్ర భగ్నమైంది. దేశం ఊపిరిపీల్చుకొంది. లూథియానా జిల్లా కోర్టు బాంబు పేలుళ్ల సూత్రధారిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత దర్యాప్తు సంస్థలిచ్చిన సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతుతో వేర్పాటువాద కార్యకలాపాలను కొనసాగిస్తోన్న సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) సంస్థకు చెందిన ఉగ్రవాది జస్విందర్‌ సింగ్‌ ముల్తానీని లూథియానా బాంబు పేలుడులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. డిసెంబరు 23న లూథియానా కోర్టు రెండో అంతస్తులో బాంబు పేలిన విషయం తెలిసిందే. రాయబార కార్యాలయం ద్వారా జర్మనీ పోలీసులకు భారత్ తగిన ఆధారాలను సమర్పించడంతో ఎర్‌ఫర్ట్‌ పట్టణంలో ముల్తానీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారీగా పేలుడు పదార్థాలు, హ్యాండ్‌ గ్రెనేడ్లను పాక్‌ మీదుగా భారత్‌లోకి పంపేందుకు ముల్తానీ ప్రయత్నిస్తున్నాడని, పంజాబ్‌, ముంబయి సహా పలు చోట్ల పేలుళ్లకు కుట్ర చేస్తున్నాడని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఖలిస్థానీ అగ్రనేతలతో ముల్తానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ముంబయిలో భారీ ఉగ్రదాడికి వ్యూహరచన చేసినట్టు తేలింది.


మాజీ కానిస్టేబుల్‌ గగన్‌దీప్‌ బాంబును అమర్చుతుండగా పేలి అతడు మరణించాడు. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పాక్ భూభాగం నుంచి ఖలిస్థాన్‌ నేతలు వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు లోతుగా దర్యాప్తు చేపట్టారు. గగన్‌దీప్‌... జస్విందర్‌ సింగ్‌ ముల్తానీతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు గుర్తించాయి. దీంతో అతడిపై పంజాబ్‌‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.గతేడాది ఖలీస్థాన్‌కు ఏర్పాటుపై రెఫరెండం క్యాంపెయిన్ నిర్వహించిన సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వాంత్ సింగ్ పన్నుకి జస్విందర్ సింగ్ ముల్తానీ అత్యంత సన్నిహితుడు. ఇక, ప్రముఖ రైతు ఉద్యమ నేత బల్బీర్ సింగ్ రాజేవాల్‌పై హత్యాయత్నం కేసులోనూ ముల్తానీ నిందితుడిగా ఉన్నాడు. బల్బీర్‌ హత్యతో పంజాబ్‌లో సిక్కులను రెచ్చగొట్టి అస్థిరపరిచేందుకు పెద్ద కుట్ర పన్నినట్టు వెల్లడయ్యింది. పంజాబ్‌లో మొత్తం 22 రైతు సంఘాలు ఉమ్మడిగా వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించగా.. రాజేవాల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి. లూథియానా పేలుళ్ల దర్యాప్తులో ఇద్దరు అనుమానితుల పాత్రపై పోలీసులకు ఆధారాలు లభించాయి. పాకిస్థాన్‌లో ఐఎస్ఐ ఆశ్రయం పొందుతున్న బబ్బర్ ఖల్సా ఉగ్రవాది హర్విందర్ సింగ్, జర్మనీలోని ఉన్న ముల్తానీల హస్తం ఉన్నట్టు తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa