ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగ భారతం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 11:03 PM

ఇంత చదువు చదివి నేను ఈ ఉద్యోగం చేయడమా. ఇక ఆ రోజులు పోయాయి. అవునండి ఈ వాస్తవం పరిశీలిస్తే అదినిజమేనని తెలుస్తుంది. దేశంలో నిరుద్యోగం ఏస్థాయిలో ఉందో తెలియజెప్పేందుకు ఈ ఘటనే ఉదాహారణ. మధ్యప్రదేశ్‌లో కేవలం 15 ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 11,000కిపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత విద్యార్హత కాగా.. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, ఎంబీఏ చదివినవారు, సివిల్ జడ్జి ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో పక్క రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి కూడా ఉండటం విశేషం.


ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ప్రకటనను జారీ చేసింది. ఇందులో బంట్రోతులు, డ్రైవర్లు, వాచ్‌మెన్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 15 పోస్టులుండగా.. విద్యార్హతను పదో తరగతిగా పేర్కొంది. దీంతో నిరుద్యోగుల నుంచి భారీ స్పందన వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందినవారు మాత్రమే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేశారు. మధ్యప్రదేశ్‌లో అధికారిక లెక్కల ప్రకారం 32,57,136 మంది నిరుద్యోగులు ఉన్నారు. వేలాదిగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖలో 30,600, హోంశాఖలో 9,388, ఆరోగ్య శాఖలో 8,592, రెవెన్యూలో 9,530 ఉద్యోగాలతో పాటు వివిధ శాఖల్లో కలిపి లక్ష వరకూ ఖాళీలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa