ఓవైపు ఓమిక్రాన్ మరోవైపు సాధారణ కోవిడ్ కేసులు పెరుగుదల కలవరపెడుతున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలను అప్రమత్తంచేస్తున్నారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ మొదలైందని సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పొరుగున ఉన్న యూపీ, ఢిల్లీ నుంచి రాకపోకలే కేసులు పెరగడానికి కారణమని అంచనాకు వచ్చారు. సీఎం నితీశ్ రాబోయే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని థర్డ్ వేవ్ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 47 కేసులు నమోదైన నేపథ్యంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ మొదలైందని భావిస్తున్నట్లు నితీశ్ పేర్కొన్నారు. అయితే పొరుగున ఉన్న యూపీ, ఢిల్లీల్లో రాత్రి కర్ఫ్యూలు అమల్లోకి వచ్చినా బీహార్లో అప్పుడే ఆ పరిస్ధితి రాదని, పరిస్ధితులను బట్టి దీనిపై ఆలోచిస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో మొత్తం 781 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167, గుజరాత్లో 73, కేరళలో 65, తెలంగాణలో 62 కేసులు ఉన్నాయి. అయితే, బీహార్లో ఇంత వరకూ ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అక్కడ సాధారణ కోవిడ్ కేసులే నమోదవుతున్నాయి. కానీ, థర్డ్ వేవ్ మొదలైందంటూ స్వయంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. పాజిటివ్ కేసులు నమోదవుతున్న అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa