ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయేల్లో ‘ఫ్లొరోనా’ వ్యాధి కలకలం

international |  Suryaa Desk  | Published : Sat, Jan 01, 2022, 11:52 AM

కరోనా  రోజుకో రూపం మార్చుకుని దాడిచేయడంతో యావత్తు ప్రపంచం అల్లాడిపోతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఈ తురుణంలో ఇజ్రాయేల్లో ‘ఫ్లొరోనా’ వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో ఫ్లొరోనా తొలి కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపింది.ఫ్లొరోనా అంటే కొవిడ్-19, ఇన్ఫ్లూయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇజ్రాయేల్లో ఈ తరహా కేసు వెలుగు చూడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. మరోవైపు.. ఇజ్రాయెల్ కోవిడ్ వ్యాక్సిన్ నాలుగో డోస్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందుతుండటం వల్ల టీకాల ద్వారా వచ్చిన వ్యాధినిరోధకశక్తి క్షీణించడంతో నాలుగో డోసు ప్రక్రియను ప్రారంభించామని ఇజ్రాయేల్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa