ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార‌త‌దేశంలో తొలి మహిళా టీచర్‌‌‌‌‌‌‌‌ సావిత్రిబాయి ఫూలే

national |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 03:45 PM

బహుజన సమాజంలోని పురుషులు కూడా చదువు నేర్చుకోకూడదని బ్రాహ్మణ వాద, మత గ్రంథాలు శాసించిన రోజులవి. ఇక స్త్రీల దుస్థితి గురించి వేరే చెప్పనవసరం లేదు. అసలు ధర్మశాస్త్రాల్లోని సారాంశాన్ని వదిలి దళిత, బహుజన స్త్రీలే కాదు బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీలు కూడా చదువుకోడానికి వీల్లేదని అడ్డుపెట్టారు. ఆ సమయంలో మహిళల పాలిట వేగుచుక్కలా పుట్టుకొచ్చింది సావిత్రిబాయి. 1831, జనవరి 3న మహారాష్ట్ర సతారా జిల్లా నాయగావ్‌‌‌‌లో లక్ష్మీబాయి, ఖండోజీ దంపతులకు సావిత్రి జన్మించింది. చక్కని రూపు రేఖలతో ఉండే సావిత్రిబాయి చిన్నతనం నుంచి ఆమె మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉండేది. చురుగ్గా, చలాకీగా ఉంటూ తన పనులతో తెలివైన బాలిక అనిపించుకుంది.


1818 సంవత్సరం జనవరి 1న మహారాష్ట్రలో బ్రాహ్మణ మనువాద రాజ్యాన్ని పాలించిన పీష్వా మరణించాడు. దేశవ్యాప్తంగా ఆంగ్లేయుల ఆధిపత్యం పెరిగిపోయింది. మహారాష్ట్ర కూడా ఆంగ్లేయుల బానిసత్వంలోకి వెళ్లిపోయింది. ఆంగ్లేయులు బ్రాహ్మణీయ విద్యావిధానానికి తిలోదకాలిచ్చి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. క్రమేణా బ్రిటిష్ వారి విద్యాబోధనకు ప్రాధాన్యత పెరిగింది. బహుజన సమాజం మరాఠీ భాషలో ఓనమాలు కూడా దిద్ద లేని అంధకార యుగమది. నిరక్షరాస్యతతోపాటు, అజ్ఞానం మూఢనమ్మకాలు బహుజన సమాజాన్ని చిత్రహింసలు పెడుతున్నాయి. అటువంటి సమయంలో సావిత్రి జీవితంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒకరోజు ఆమె బజారు వెళ్లినప్పుడు అక్కడ ఒక చెట్టు కింద కొంతమంది మిషనరీ క్రైస్తవ స్త్రీలు, పురుషులు పాడటం చూసింది. అక్కడున్న వారు ఆమెను చూసి ‘‘అమ్మ నీకు ఒక పుస్తకం ఇస్తాము.. నీకు చదువు రాక పోయినా పర్వాలేదు. ఆ బుక్‌‌‌‌లో బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు చూసి నువ్వు కొంత అర్ధం చేసుకోవచ్చు’’ అని ఆమె ఒక బుక్‌‌‌‌ ఇచ్చారు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి తండ్రికి చూపించింది. అది చూసిన ఆమె తండ్రి ‘‘నువ్వు కులాన్ని బ్రష్టు పట్టిస్తున్నావని” తిట్టడమే కాదు బుక్‌‌‌‌ని విసిరేసాడు. కానీ సావిత్రి ఆ పుస్తకాన్ని జాగ్రత్త పెట్టి పెండ్లి అయ్యాక, అత్తారింటికి దాన్ని కూడా తీసుకెళ్లింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది.


ఆరేళ్లకు ఆడపిల్లలకు, పదేళ్లకు మగ పిల్లలకు పెళ్లి చేయకపోతే అప్పటి సమాజం వారిని చిన్న చూపు చూసేది. తప్పనిసరి పరిస్థితుల్లో 9 ఏండ్లకే సావిత్రిని 12ఏండ్ల జ్యోతిరావుకు ఇచ్చి పెండ్లి చేశారు. పెండ్లి అయ్యాక అత్తవారింటికి వెళ్ళేసరికి అక్కడ కేవలం జ్యోతి రావు అతని తండ్రి మాత్రమే ఉండటంతో, చిన్న వయసులోనే కుటుంబ భారం మొత్తం సావిత్రి భుజాల పై పడింది. అప్పటికి జ్యోతిరావు పూలే క్రైస్తవ మిషనరీ స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఆయన అలా చదువుకోవడం ధర్మ విరుద్ధమని బ్రాహ్మణ సాంప్రదాయ వాదులు భావించేవారు. పూలే తండ్రిని నిందించేవారు. ఈ విమర్శలు శృతిమించడంతో తట్టుకోలేనతండ్రి అతన్ని బడి మానిపించాడు. 1842లో పూలే తిరిగి స్కూలుకు వెళ్ళారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. ‘సావిత్రి కూడా ఎందుకు చదువుకోకూడదు’ అని పూలే ఆలోచించారు. స్వయంగా తానే సావిత్రికి చదువు నేర్పడం ప్రారంభించారు. భర్తను అనుసరిస్తూ సావిత్రి మెల్లమెల్లగా మరాఠి, ఇంగ్లిష్​ చదవడం, రాయడం నేర్చుకున్నారు. నిరక్షరాస్యులైన సావిత్రి అక్షరాస్యురాలిగా మారడం ఆమె జీవితంలొ గొప్ప మలుపు వచ్చింది. భావితరాలకు సరైన మార్గం చూపించగలిగే ఒక ఆదర్శ విప్లవ స్త్రీ మూర్తిగా సావిత్రిబాయి చరిత్రకెక్కేందుకు వేసిన తొలి అడుగు, ఆమె చదువు నేర్చుకోవడం.


సావిత్రికి బ్రాహ్మణ స్నేహితులుండేవారు. సావిత్రిబాయి నిస్వార్థ సేవ వలన కేవలం దళిత సమాజంలోనే కాక మహారాష్ట్ర సమాజంలోనే ఆమె పేరు ప్రఖ్యాతులు పెరిగాయి. సామాజిక సేవకు సహాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు. అదే సమయంలో సావిత్రిబాయిని విమర్శించే వారు అధికంగానే ఉండేవారు. అందరూ అమ్మలక్కల ఇంట్లో కూర్చోకుండా వీధుల్లోకి వచ్చి అంటరానివారికి బాలికలకు విద్య నేర్పించడం సాంప్రదాయ బ్రాహ్మణ వాదులు సహించలేకపోయేవారు. అయినా సావిత్రిబాయి చలించలేదు. ఆమె పట్టుదల అలాంటిది. అన్ని కష్టనష్టాల్లో జ్యోతి రావు పూలే ఆమెకు సపోర్ట్​గా నిలిచేవారు. మహాత్మా పూలే మరణం తర్వాత సావిత్రిబాయి తాము స్థాపించిన సంస్థలన్నింటినీ నడిపే బాధ్యత తీసుకొని సంస్థలంన్నిటినీ అభివృద్ధి పథంలోకి నడిపించారు. 1896లో రాష్ట్రంలో పెద్ద కరువు వచ్చింది. వేలాదిమంది నీరు ఆహారం లేక మరణించారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించాడు.


1848, జనవరి 1న పూలే బాలికల కోసం ఇండియాలో మొదటిబడిని ప్రారంభించగా, అందులో సావిత్రి మొదటి మహిళా టీచర్‌‌‌‌‌‌‌‌గా పని చేశారు.‌‌‌‌‌‌‌‌ ఈ బడి స్థాపించేందుకు పూలే ఎన్ని కష్టాలు పడ్డారో టీచర్‌‌‌‌‌‌‌‌గా పాఠాలు చెప్పేందుకు సావిత్రి అంతకంటే ఎక్కువనే కష్టాలు పడ్డారు. ఎంతోమంది ఆమె ఉద్యోగాన్ని మానిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. బాలికల బడి కావడంతో ఇందులో పనిచేసేందుకు పురుషులు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఆడపిల్లలను బడికి పంపించేందుకు పేరేంట్స్‌‌‌‌ కూడా ఒప్పుకునేవారు కాదు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని సావిత్రిబాయి ముందుకు సాగారు. పిల్లలను బడికి తీసుకొచ్చి వారికి చదువు నేర్పడం మొదలుపెట్టారు. చదువే కాకుండా ఆటపాటలు కూడా నేర్పించేవారు. పిల్లలతో ప్రేమగా ఉంటూ వారిలో మానసిక వికాసాన్ని పెంపొందించారు. ఆరోగ్యం సరిగాలేని చిన్నారులను ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేవారు. ఇలాంటి సంఘటనలతో సావిత్రి బాయి బహుజనుల మనసు కూడా గెలుచుకోగలిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa