ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాధ్యతలు సరిగ్గా నిర్వహించండి: కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 04:24 PM

పశ్చిమ గోదావరి: మండల ప్రత్యేక అధికారుల కు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా ఆదేశించారు.


సోమవారం కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్ డి ఓ లు , మున్సిపల్ కమిషనర్ లు , మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఎన్ని లేఔట్ లు ఉన్నాయి, ఎన్ని లేఔట్ లలో పనిజరుగుతుంది , ఎన్ని లేఔట్ లలో పని జరగడం లేదు, ఒక్కొక్క లేఔట్ లోఎన్ని గృహాలు ఉన్నాయి , ఎన్ని గృహాలు ప్రారంభమయ్యాయి , అందులో ఎన్ని బి యల్ లేవిల్ లో ఉన్నాయి, రూప్ లేవిల్ లో ఉన్నాయి , ఎన్ని రోజుల నుండి స్టేజ్ కన్వర్షన్ జరగలేదు , లేఔట్ వారీగా స్టేజ్ వారీగా మండల స్పెషల్ ఆఫీసర్ ల వద్ద సమాచారం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు అన్ని లేఔట్ లు సందర్శించాలని ఆయన సూచించారు.


ప్రతి మండలంలో ఓటీఎస్ లోని ఎంతమంది లబ్దిదారులు ఉన్నారు, వారిలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు , ఎంతమంది రుణాలు తీసుకొనివారు ఉన్నారు వారి డేట్ ఎంత వరకు నమోదయింది , ఎంతమంది డబ్బులు కట్టారు , ఎంతమంది డబ్బులు కట్టలేదు, కట్టని వారిని ఎంక్వైరీ పూర్తయిందా? వంటి సమాచారం ప్రత్యేక అధికారుల వద్ద ఉండాలని ఆయన సూచించారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఎంపీడీవోలు , ఏ ఈ లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రెటరీ లతో సచివాలయం వారిగా సమీక్షించాలని ఆయన సూచించారు. ప్రతి లేఔట్ లో పని కచ్చితంగా జరగాలని ఆయన అన్నారు. ప్రతి లేఔట్ లో లెవిలింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి లేఔట్ లో ఇంటర్నల్ రోడ్లు , లింకు రోడ్లు పనులు వేగవంతం చేయాలని ఆయన ఆన్నారు. జనవరి 30 నాటికి జిల్లాలోని అన్ని లేఔట్ లలో లేవిలింగ్ పనులు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు.


90 రోజులలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు పిఓటి భూములను గుర్తించాలని ఆయన సూచించారు. పిఓటి భూములు తీసుకునేటప్పుడు ప్రొసీజర్ పాటించాలని ఆయన అన్నారు. మల్టీ పర్పస్ గోడౌన్ల నిర్మాణానికి భూములు గుర్తించాలి , సొసైటీలో పరిధిలోని పక్క గ్రామంలో అయినా భూములు గుర్తించాలని ఆయన సూచించారు.


ఈరోజు నుండి 15 నుండి 18 సంవత్సరాల వయసు వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయడం ప్రారంభించడం జరిగిందని దీనిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ప్రతి జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ఆయన అన్నారు. ఈనెల 10వ తేదీ నుండి హెల్త్ కేర్ వర్కర్లు , ఫ్రెంట్ లైన్ వర్కర్లు , 60 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు , హెల్త్ కేర్ వర్కర్లు , 60 సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది ఉన్నారో డేటా మండల వారీగా , మున్సిపాలిటి , రెవెన్యూ డివిజన్ వారీగా సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. వివిధ శాఖలలో ఫ్రంట్ లైన్ వర్కర్లు గా వ్యాక్సిన్ వేసుకున్న వారందరూ ఈనెల 10వ తేదీ నుండి వ్యాక్సినేషన్ ప్రికాష్ నరిడోస్ విధిగా తీసుకోవాలని ఆయన సూచించారు.


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ )డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జాయింట్ కలెక్టర్( అభివృద్ధి ) హిమాషు శుక్లా, జాయింట్ కలెక్టర్ (సంక్షేమ) శ్రీమతి పద్మావతి , డి ఆర్ ఓ డేవిడ్ రాజు , హౌసింగ్ పిడి వేణుగోపాల్, జిల్లా పరిషత్ సీఈవో హరిహారనాడ్ , dpo రమేష్ బాబు , డిఆర్డీఏ పిడి. శ్రీనివాస్ , డ్వామా పిడి రాంబాబు , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa