ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రతా లోపం.. పీఎం పర్యటన రద్దు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 05, 2022, 03:47 PM

పంజాబ్‌ లోని ఫిరోజ్‌పూర్‌ లో జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ సభ రద్దయ్యింది. భద్రతా లోపల కారణంగా ప్రధాని పర్యటన అర్ధాంతరంగా రద్దు చేశారు. ప్రధాని మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమాలు వాయిదా వేసినట్లు బీజేపీ వెల్లడించింది. పంజాబ్‌ లోని అమరవీరుల స్మారకానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పీఎం మోదీ కాన్వాయ్ ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాలపాటు పీఎం కాన్వాయ్‌ను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. దీంతో ప్రధాని తిరిగి భటిండా ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై పంజాబ్‌ ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. ప్రధాని మోదీ ఫ్లైఓవర్‌పై 20 నిమిషాలపాటు ఇరుక్కుపోయారని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa